HYD: హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇవాళ ఉ.5:30 నిమిషాలకు బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. అయితే దీనిపై చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం ఇచ్చారట. దీంతో ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఎయిర్వేస్ తీరుపై తిరుమల వెళ్లే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.