ప్రపంచ కప్కు ముందే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దారుణమైన నిర్వహణ తీరు బట్టబయలైంది. ప్రేక్షకుల సీట్లపై అనేక చోట్ల పక్షుల రెట్టలు అలాగే ఉన్న ఓ వీడియో చూసిన నెటిజన్లు అధికారుల తీరుపై కామెంట్లు చేస్తున్నారు. ఇందులో అవినీతి జరిగిందని దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణలో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటించింది.
తొలిగించిన ఓట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నాయి. వారిలో పురుషులు కోటి58లక్షల71వేల 493మంది ఉన్నారు. మహిళా ఓటర్లు కోటి 58లక్షల 43వేల339మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు 2557మంది ఓటర్లు. ఓవర్సీస్ ఓటర్లు 2780మంది ఉన్నారు.
జంతువులకు హాని కలుగనీయకుండా.. ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోకు సంబంధించి మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బహిరంగ సభ వేదికపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని.. శుభ వార్త వినేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు.
మహిళలకు రాజకీయం వద్దు అన్న ఎంఐఎం పార్టీలో అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు రాజకీయ అరంగేట్రం చేస్తుందన్న సమాచారం బలంగా వినిపిస్తుంది. ఇప్పటివరకు పురుషాధిక్య పార్టీగా పేరున్న ఎంఐఎం త్వరలోనే ఆ అపవాదును తొలిగించే పనిలో ఉందని తెలుస్తుంది.
బీజేపీ హైకమాండ్ పిలుపుతో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. పసుపుబోర్డు ఏర్పాటు, గిరిజన వర్సిటీ.. ఇతర అంశాల గురించి కిషన్ రెడ్డితో అమిత్ షా మాట్లాడతారు. తర్వాత క్యాబినెట్ సమావేశంలో ఈ రెండు అంశాలు.. ఇతర అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
ఇందూరు సభలో ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై బీజేపీ- బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది.
హైదరాబాద్ బిర్యానీపై పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్(Shadab Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ICC ప్రపంచ కప్ 2023కి ముందు హైదరాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ, చివరి వార్మప్ గేమ్లో మెన్ ఇన్ గ్రీన్ జట్టు ఓడిపోవడంతో ఈ కామెంట్లు చేశారు.
తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్నికల షెడ్యూల్ మరో రెండు మూడు రోజుల్లో రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించారు.
తాను ముఖ్యమంత్రి కావడానికి ప్రధాని మోదీ అనుమతి అక్కరలేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి మళ్లీ చుక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్ కొట్టివేసింది సుప్రీంకోర్టు.
తెలంగాణ బీఎస్పీ తమ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ను విడుదల చేసింది.
తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.