ASF: కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటం లేదు. దీంతో కాజీపేట్-బల్లార్షా సెక్షన్ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సేవలు ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ప్రయాణికు ఇబ్బందులు పడుతున్నారు.
JN: జఫర్గడ్ మండల కేంద్రంలో మంజూరు అయిన బ్యాంక్ అఫ్ బరోడా బ్రాంచ్ ఏర్పాటుకు కావాల్సిన భవనాలను సంబంధిత బ్యాంక్ ఆర్ఎం, బ్రాంచ్ మేనేజర్ లతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. మెయిన్ రోడ్డుపై నిర్మాణంలో ఉన్న భవనంలో బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు అధికారులు అంగీకరించారు. వెంటనే భవన యజమానితో బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పనులను వెంటనే పూర్తి చెయాలన్నారు.
HNK: హనుమకొండలోని ఫాతిమా నగర్, బాలవికాస కేంద్రంలో నిర్వహించిన బాలవికాస రాష్ట్ర స్థాయి మహిళా సభకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. బాలవికాస కేంద్రం మహిళల అభివృద్ధి కొరకు పాటుపడుతుందని అన్నారు. ఎక్కడైతే మహిళలు చైతన్యవంతులుగా ఉంటారో అక్కడే అభివృద్ధి ఉంటుందన్నారు.
MNCL: తాండూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వినోద్ ఆదేశాల మేరకు పోగుల భీమేష్ అనే వ్యక్తికి మంజూరైన 21 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసా బుధవారం అందజేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
MNCL: ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ హైదరాబాదులో నిర్వహించే వెయ్యి గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షులు కొండుకూరు ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి జంగం రవి కోరారు. బుధవారం జన్నారంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాదులో మహా ప్రదర్శన ఉంటుందని, ఆ కార్యక్రమానికి అందరూ రావాలన్నారు.
MNCL: ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ హైదరాబాదులో నిర్వహించే వెయ్యి గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షులు కొండుకూరు ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి జంగం రవి కోరారు. బుధవారం జన్నారంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాదులో మహా ప్రదర్శన ఉంటుందని, ఆ కార్యక్రమానికి అందరూ రావాలన్నారు.
ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ అనే వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివాసి హక్కుల తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు గోడం గణేష్ కోరారు. పట్టణంలో సంఘం నాయకులతో కలిసి బుధవారం మాట్లాడారు. విద్యార్థి సంఘం నుంచి అంచలంచలుగా ఎదుగుతూ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు బొజ్జు పటేల్ అని పేర్కొన్నారు.
ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ అనే వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివాసి హక్కుల తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు గోడం గణేష్ కోరారు. పట్టణంలో సంఘం నాయకులతో కలిసి బుధవారం మాట్లాడారు. విద్యార్థి సంఘం నుంచి అంచలంచలుగా ఎదుగుతూ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు బొజ్జు పటేల్ అని పేర్కొన్నారు.
NRML: ఎమ్మెల్యే బొజ్జును ఖానాపూర్ గంగపుత్ర సంఘం నాయకులు కలిశారు. బుధవారం ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను వారు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఖానాపూర్ పట్టణంలో గంగపుత్ర సంఘం నూతన ప్రారంభోత్సవం ఫిబ్రవరి 3న ఉందని తప్పకుండా రావాలని ఎమ్మెల్యేను వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ గంగపుత్ర సంఘ అధ్యక్షులు పరిమి సురేష్ పాల్గొన్నారు.
NRML: ఎమ్మెల్యే బొజ్జును ఖానాపూర్ గంగపుత్ర సంఘం నాయకులు కలిశారు. బుధవారం ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను వారు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఖానాపూర్ పట్టణంలో గంగపుత్ర సంఘం నూతన ప్రారంభోత్సవం ఫిబ్రవరి 3న ఉందని తప్పకుండా రావాలని ఎమ్మెల్యేను వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ గంగపుత్ర సంఘ అధ్యక్షులు పరిమి సురేష్ పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని వాల్మీకి దేవాలయం దగ్గర ఉన్న కల్వర్టు వంతెనను మూసివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కోరారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు. కల్వర్టు ప్రమాద భరితంగా ఉందని వాహనదారులు గుంతలోపడే అవకాశం ఉందని, దీన్ని వెంటనే పూడ్చాలని పేర్కొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని వాల్మీకి దేవాలయం దగ్గర ఉన్న కల్వర్టు వంతెనను మూసివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కోరారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు. కల్వర్టు ప్రమాద భరితంగా ఉందని వాహనదారులు గుంతలోపడే అవకాశం ఉందని, దీన్ని వెంటనే పూడ్చాలని పేర్కొన్నారు.
మెదక్: రామాయంపేటలోని రైతు వేదికలో దివ్యాంగులకు రేపు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా డీడబ్ల్యూ హైమావతి మాట్లాడుతూ.. రామాయంపేటలో నిర్వహించే శిబిరానికి రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట, వెల్దుర్తి, మాసాయిపేట, చిన్న శంకరంపేట మండలాల దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.
MDK: నిజాంపేట మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పలువురు రైతులు వారి పొలాలలో మొక్కజొన్న పంటలు వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పంట మార్పిడి విధానం ద్వారా పంట దిగుబడి అధికంగా లభిస్తుందని ఒకసారి వరి, మరోసారి మొక్కజొన్న వేసినట్లు తెలిపారు. మొక్కజొన్న క్వింటాల్క రూ.3000 పైనే ఉంటుందన్నారు. దీంతో మొక్కజొన్నపై ఆసక్తి చూపిస్తున్నారు.
మెదక్: రామాయంపేట మండలం దామచెరువు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద 918 మంది రైతులకు రూ. 93.63లక్షలను ఖాతాలో జమ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుభరోసా కోసం కొత్త పట్టా పాస్ పుస్తకం కలిగిన రైతులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.