• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

PDPL: రోడ్డు భద్రతా మాసొత్సవాల సందర్భంగా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్‌లో బుధవారం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో చేపట్టిన ఆటోల ర్యాలీని జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

January 29, 2025 / 03:28 PM IST

‘మున్సిపల్ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారు’

NRML: ఖానాపూర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారనీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పడాల లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ రాచమల్ల రాజశేఖర్ అన్నారు. రిపబ్లిక్ అవార్డులు పొందిన అవార్డు గ్రహీతలను బుధవారం సాయంత్రం ఖానాపూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు పాల్గొన్నారు.

January 29, 2025 / 03:12 PM IST

అధికారులపై చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్సీ సారయ్య

WGL: అజంజాహీ కార్మికుల భవన స్థలాన్ని కాపాడాలని, కబ్జాకోరులకు సహకరించిన మునిసిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని MLC బసవరాజు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అజంజాహీ మిల్ స్థలం ముమ్మాటికీ కార్మికులదే అని, జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసని, కానీ తప్పుడు పత్రాలు సృష్టించి, భవనం కూల్చారన్నారు.

January 29, 2025 / 03:10 PM IST

జిల్లా పాలిటెక్నిక్ బీసీ లెక్చరర్స్ సంఘం సభ్యుల ఎన్నిక

NZB: తెలంగాణ బీసీ లెక్చరర్ల సంఘం నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్ బీసీ లెక్చరర్స్‌కో ఆర్డినేటర్‌గా పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ లక్ష్మణ్  శాస్త్రి, ఐలాపూర్ జూనియర్ కళాశాలకు చెందిన జక్కుల రాధా కిషన్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా  ఎన్నికైనట్లు నందిపేట్ మండలం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

January 29, 2025 / 03:04 PM IST

‘అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి’

PDPL: రామగుండం కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లలో ఇంఛార్జీ కమిషనర్ అరుణ శ్రీ పర్యటించారు. ఈ మేరకు రహదారులకు, వాహనాల రాకపోకలకు అడ్డుగా నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ కాలనీలలో ఉన్న డ్రైనేజీలను పరిశీలించి, ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని సూచించారు. మంచినీటి పైప్ లైన్ల లీకేజీలను మరమ్మతులు చేయాలన్నారు.

January 29, 2025 / 02:56 PM IST

కాజీపేట-అజ్నీ ట్రైన్ సేవలు పునరుద్ధరించాలి

ASF: కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటం లేదు. దీంతో కాజీపేట్-బల్లార్షా సెక్షన్ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సేవలు ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ప్రయాణికు ఇబ్బందులు పడుతున్నారు.

January 29, 2025 / 02:22 PM IST

బ్యాంక్ ఏర్పాటుకు భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే

JN: జఫర్గడ్ మండల కేంద్రంలో మంజూరు అయిన బ్యాంక్ అఫ్ బరోడా బ్రాంచ్ ఏర్పాటుకు కావాల్సిన భవనాలను సంబంధిత బ్యాంక్ ఆర్ఎం, బ్రాంచ్ మేనేజర్ లతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. మెయిన్ రోడ్డుపై నిర్మాణంలో ఉన్న భవనంలో బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు అధికారులు అంగీకరించారు. వెంటనే భవన యజమానితో బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పనులను వెంటనే పూర్తి చెయాలన్నారు.

January 29, 2025 / 02:21 PM IST

‘మహిళల అభివృద్ధి కోసం బాలవికాస పాటుపడుతుంది’

HNK: హనుమకొండలోని ఫాతిమా నగర్, బాలవికాస కేంద్రంలో నిర్వహించిన బాలవికాస రాష్ట్ర స్థాయి మహిళా సభకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. బాలవికాస కేంద్రం మహిళల అభివృద్ధి కొరకు పాటుపడుతుందని అన్నారు. ఎక్కడైతే మహిళలు చైతన్యవంతులుగా ఉంటారో అక్కడే అభివృద్ధి ఉంటుందన్నారు.

January 29, 2025 / 01:46 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

MNCL: తాండూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వినోద్ ఆదేశాల మేరకు పోగుల భీమేష్ అనే వ్యక్తికి మంజూరైన 21 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసా బుధవారం అందజేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

January 29, 2025 / 01:36 PM IST

ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో మహా ప్రదర్శన

MNCL: ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ హైదరాబాదులో నిర్వహించే వెయ్యి గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షులు కొండుకూరు ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి జంగం రవి కోరారు. బుధవారం జన్నారంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాదులో మహా ప్రదర్శన ఉంటుందని, ఆ కార్యక్రమానికి అందరూ రావాలన్నారు.

January 29, 2025 / 01:20 PM IST

ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో మహా ప్రదర్శన

MNCL: ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ హైదరాబాదులో నిర్వహించే వెయ్యి గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షులు కొండుకూరు ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి జంగం రవి కోరారు. బుధవారం జన్నారంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాదులో మహా ప్రదర్శన ఉంటుందని, ఆ కార్యక్రమానికి అందరూ రావాలన్నారు.

January 29, 2025 / 01:20 PM IST

ఇర్ఫాన్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి: గణేష్

ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ అనే వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివాసి హక్కుల తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు గోడం గణేష్ కోరారు. పట్టణంలో సంఘం నాయకులతో కలిసి బుధవారం మాట్లాడారు. విద్యార్థి సంఘం నుంచి అంచలంచలుగా ఎదుగుతూ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు బొజ్జు పటేల్ అని పేర్కొన్నారు.

January 29, 2025 / 01:04 PM IST

ఇర్ఫాన్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి: గణేష్

ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ అనే వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివాసి హక్కుల తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు గోడం గణేష్ కోరారు. పట్టణంలో సంఘం నాయకులతో కలిసి బుధవారం మాట్లాడారు. విద్యార్థి సంఘం నుంచి అంచలంచలుగా ఎదుగుతూ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు బొజ్జు పటేల్ అని పేర్కొన్నారు.

January 29, 2025 / 01:04 PM IST

ఎమ్మెల్యేను కలిసిన గంగపుత్ర సంఘం నాయకులు

NRML: ఎమ్మెల్యే బొజ్జును ఖానాపూర్ గంగపుత్ర సంఘం నాయకులు కలిశారు. బుధవారం ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను వారు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఖానాపూర్ పట్టణంలో గంగపుత్ర సంఘం నూతన ప్రారంభోత్సవం ఫిబ్రవరి 3న ఉందని తప్పకుండా రావాలని ఎమ్మెల్యేను వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ గంగపుత్ర సంఘ అధ్యక్షులు పరిమి సురేష్ పాల్గొన్నారు.

January 29, 2025 / 12:20 PM IST

ఎమ్మెల్యేను కలిసిన గంగపుత్ర సంఘం నాయకులు

NRML: ఎమ్మెల్యే బొజ్జును ఖానాపూర్ గంగపుత్ర సంఘం నాయకులు కలిశారు. బుధవారం ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను వారు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఖానాపూర్ పట్టణంలో గంగపుత్ర సంఘం నూతన ప్రారంభోత్సవం ఫిబ్రవరి 3న ఉందని తప్పకుండా రావాలని ఎమ్మెల్యేను వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ గంగపుత్ర సంఘ అధ్యక్షులు పరిమి సురేష్ పాల్గొన్నారు.

January 29, 2025 / 12:20 PM IST