SRPT: తాను పనిచేసే పాఠశాలకు చేయూతనందించేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని గరిడేపల్లి మండల విద్యాధికారి చక్రునాయక్ అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బోళ్ల గోవిందరెడ్డి అనే ఉపాధ్యాయుడు రూ.5 వేల ఆర్థిక సహాయంతో ఐదు చెత్త బుట్టలు, మూడు డ్రమ్ములు మంగళవారం సాయంత్రం పాఠశాలకు అందించారు.