JGL: ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ 10 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.