ADB: బజార్ హత్నూర్ మండలం మాన్కపూర్ గ్రామ ఉప సర్పంచ్ జాదవ్ నితిన్, BRS నాయకులు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.