NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన మహిళ బస్సు రేణుక (24) అదృశ్యమైనట్లు తండ్రి బుస్సు యాదయ్య ఫిర్యాదుతో మంగళవారం చిట్యాల పీఎస్లో కేసు నమోదు అయ్యింది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం … ఈనెల 4న రేణుక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎంఎస్సీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు.