కామారెడ్డి: జహీరాబాద్ పట్టణానికి చెందిన చిద్రి ఉమా హనుమాన్ గుప్తా కుమార్తె చిద్రి లిఖిత CA తుది ఫలితాలలో జాతీయస్థాయిలో 37వ ర్యాంకు సాధించింది. శుక్రవారం MLA క్యాంపు కార్యాలయంలో లిఖితను MLA మాణిక్ రావు సన్మానించి అభినందనలు తెలిపారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జహీరాబాద్కు గర్వకారణమని MLA అన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.