IPL 2024 మినీ వేలం మరికొన్ని రోజుల్లో షురూ కానుంది. అయితే అందుకోసం ఇప్పటికే బీసీసీఐ మొదటి సెట్లో మొత్తం కేవలం 333 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసింది. వీటిలో నుంచి 77 మందిని ఎంపిక చేయనున్నారు.
ఐపీఎల్ 17వ సీజన్కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న జరగనుండగా, వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను విడుదల చేశారు. గతంలో ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనేందుకు 1,166 మంది ఆటగాళ్లు తమ పేర్లను సమర్పించారు. కానీ ప్రస్తుతం 333 మంది ఆటగాళ్లు మాత్రమే తుది జాబితాలో ఉన్నారు. మిగిలిన 833 మంది ఆటగాళ్ల పేర్లు తొలగించబడ్డాయి. అయితే వీరి నుంచి చివరిగా 77 మందిని సెలక్ట్ చేయనున్నారు.
తొలిసారి ఐపీఎల్లో పాల్గొనాలనే ఆశతో పెద్దపెద్ద కలలతో తమ పేర్లు పెట్టుకున్న చాలా మంది యువ ఆటగాళ్లకు ఇది తీవ్ర నిరాశను మిగిల్చింది. BCCI విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో, 2024 IPL ఆటగాళ్ల జాబితాను ప్రచురించింది. 2023 డిసెంబర్ 19న దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో జరిగే వేలంలో 333 మంది క్రికెటర్లు పాల్గొంటారని చెప్పారు.
అలాగే ఆ 333 మంది ఆటగాళ్లలో 214 మంది భారతీయులు కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు. వీరిలో 2 క్రీడాకారులు అసోసియేట్ దేశాలకు చెందినవారు. వీరిలో 116 మంది ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం ఉంది. 215 మంది ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడని ఆటగాళ్లు. వారు కాకుండా అసోసియేట్ దేశాల నుండి 2 ఆటగాళ్లు ఉన్నారు. గరిష్టంగా పది ఐపీఎల్ జట్లకు మొత్తం 77 సీట్లను వేలం వేయనున్నారు. విదేశీ ఆటగాళ్లకు 30 సీట్లు కేటాయించారు.
ఇందులో 2 కోట్లు అత్యధిక బేస్ ధర. దీని ప్రకారం 23 మంది ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్గా అత్యధికంగా 2 కోట్లను నిర్ణయించారు. రూ.1.5 కోట్ల బేస్ ధరతో 13 మంది ఆటగాళ్లు వేలం జాబితాలో ఉన్నారు. 2024 IPL మినీ వేలం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుంది (దుబాయ్) – వేలం IST మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటించబడింది.
వేలం తొలి సెట్లో హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రోమన్ పావెల్, రిలే రౌసో, పాట్ కమిన్స్, గెరాల్డ్ కోయెట్జీ, హజరంగా, డారిల్ మిచెల్, అస్మతుల్లా ఒమర్జాయ్, రచిన్ రవీంద్ర, క్రిస్ వోక్స్, షార్దుల్ ఇనాక్స్ రెండవ సెట్ ఠాకూర్ కూడా ఉన్నట్లు సమాచారం.