WG: నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.
KDP: లింగాల మండలం అక్కులగారిపల్లెలో హరిస్వామి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ‘న్యూ కేటగిరీ’ విభాగంలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆరు రకాల నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోటీలో పాల్గొనే రైతులు శనివారం లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
TPT: వెంకటగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతూ సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు ఈ సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి రూపాయి నేరుగా అర్హులైన బాధితులకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు.
MBNR: హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో దెబ్బడి బాలమ్మ, కృష్ణయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలమడ్డాయి. పాలమూరు డిప్యూటీ మేయర్ గణేశ్ సురేందర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియలకు తన వంతుగా రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ తదితరులు కూడా పాల్గొన్నారు.
BHNG: ఎం తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన కొరిమి నర్సయ్య ఇటీవల మృతి చెందాడు. మృతుని కుటుంబానికి గ్రామ సర్పంచ్ మన్నెపు రజిత-తిరుపతి రెడ్డి రూ.10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మెండు నర్సిరెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
BPT: మార్టూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పంచాయతీ సిబ్బందితో కలిసి ఆసుపత్రి పరిసరాలను, వార్డు గదులను శుభ్రం చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చికెన్ పాక్స్ (ఆటలమ్మ) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు,యువత ఎక్కువగా ప్రభావితమవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం, దద్దుర్లు, తీవ్రమైన దురద వంటి లక్షణాలతో అనేక మంది బాధపడుతున్నారని సమాచారం. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, బాధితులకు వైద్యసహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు
TPT: పురమిత్ర యాప్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ ఎన్.మౌర్య, అధికారులను ఆదేశించారు. పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆరోగ్య శాఖ అధికారులతో కలసి ప్రకాశం పార్క్, శివ శక్తి కళ్యాణ మండపం, తదితర ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. స్వర్ణ వార్డులో కార్యదర్శుల హాజరు నమోదు రికార్డులను పరిశీలించారు.
BDK: డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని కొత్తగూడెం మేయర్ గణేశ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్లో శనివారం పర్యటించారు. పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి, స్థానికులతో ముచ్చటించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు చినరావూరు పార్కు వద్ద ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సంప్రదాయ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు.
చిన్నప్పటి నుంచే పిల్లలను చెప్పులు లేకుండా నేలపై, పచ్చగడ్డిపై నడిపించడం కంటి ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. ఇలా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి కలిగి కళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది. పచ్చదనాన్ని చూడటం వల్ల కంటి కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ అలవాటు వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత, మంచి నిద్ర కూడా లభిస్తాయి.
NGKL: పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం మేడిపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి శనివారం ఎమ్మెల్యే హాజరై, ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
PPM: ప్రజల భాగస్వామ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు గన్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతినెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ కార్యక్రమం పార్వతీపురం కేంద్ర ఆసుపత్రిలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.
BDK: అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో సర్పంచ్ కోండ్రు సోమయ్య అధ్యక్షతన గ్రామసభ ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతిలో ఉన్నటువంటి పలు సమస్యలపై చర్చించారు. సర్పంచ్ సోమయ్య మాట్లాడుతూ.. గ్రామంలో మిగిలిపోయినా సీసీ రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ కాలువలు సమస్య విద్యుత్ స్తంభాల సమస్య, వీధి దీపాల సమస్యలను, పారిశుద్ధ్య పనులు పరిష్కరించుకోవాలని తీర్మానించారు.
MLG: జిల్లాలో మాదిగలకు రాజకీయ పార్టీలు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని MRPS రాష్ట్ర నాయకుడు వావిలాల స్వామి మాదిగ మండిపడ్డారు. కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఇవాళ ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా మాదిగలను ఓటర్లుగా మాత్రమే వినియోగిస్తూ పదవులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో MRPS జిల్లా నేతలు తదితరులు ఉన్నారు.