KKD: పిఠాపురం మండలం వెల్దుర్తిలో రైతులు రింగ్ మోడల్ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక మందులు వాడకుండా, ఎరువులతో బీర, కాకర, బెండ, వంగతో పాటు పది రకాల ఆకుకూరలు పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యవసాయ పద్ధతి అందరినీ ఆకట్టుకుంటోంది.