కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.97,205 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 89 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 8 మంది దంపతులు శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. 920 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.