TPT: తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో శనివారం అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరిగాయి. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు విశిష్టత ఉంటుంది. అమావాస్య నాడైన శనివారం ఉదయం సహస్ర కలశాభిషేకం సేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి హనుమంత వాహనసేవ వేడుకగా జరిగింది.