AP: కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరులో విషాదం నెలకొంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు యువకులు ఉండగా ఇద్దరు మహిళలు ఉన్నారు. మరణించిన వారు కర్ణాటకలోని కురుడి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.