SS: నేతన్నల ఆరోగ్య రక్షణకు ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’తో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మంగళవారం ధర్మవరంలో నిర్వహించిన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. ధర్మవరం పట్టు చీరలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని తెలిపారు.