కడప నగరంలోని చెర్లోపల్లి లేఔట్ రహదారి సమస్య, దస్తగిరిపేట స్మశాన వాటిక మురుగునీటి సమస్యల పరిష్కారానికి కడప, కమలాపురం ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ విజ్ఞప్తి చేశారు. బుధవారం కడపలో ఆయన మాట్లాడారు. చెర్లోపల్లి రహదారి సమస్య ఏడాది కాలంగా పెండింగ్లో ఉందని, అధికారులు స్పందించడం లేదని ఆయన అన్నారు.