SRPT: సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి మహాదేవ నామేశ్వర స్వామి శివాలయంలో మూల నక్షత్రం మహా పర్వదినం సందర్భంగా శనివారం సరస్వతి అమ్మవారికి అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణ, శ్రీ చక్రదేవతకు మహిళా భక్తులు ఘనంగా పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ అర్చకులు కుంకుమ పూజ, నీరాజన మంత్రపుష్పం నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ చేశారు.