MDK: నర్సాపురం మండలంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా ముఖ్య సలహాదారుడు మిరియాల చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటలను గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.