HYD: మెహిదీపట్నంలో బస్టాప్లో అగ్నిప్రమాదం సంభవించింది. మెహిదీపట్నం నుంచి ఉప్పల్కు వెళ్తున్న ఆర్డినరీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.