ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బడ్జెట్ ప్రతులతో మంత్రి హరీశ్ రావు విచ్చేసి పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిస...
మార్చి లో 2023 లో జరగనున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొసం ముంబై ఇండియన్స్ జట్టు కోచ్లను ఎంపిక చేసింది. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ను, బౌలింగ్ కోచ్గా భారత మాజీ స్టార్ బౌలర్ ఝులన్ గోస్వామిని, బ్యాటింగ్ కోచ్గా భారత మాజీ ఆల్ రౌండర్ దెవీకా పల్షికార్ను జట్టు ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని జట్టు అధికారికంగా వెల్లడించింది. ఝులన్ గోస్వామి రెండు దశాబ్దాలపాటు జట...
ఎన్నికల సమయంలో చేసిన అప్పు తీర్చలేక ,రుణం ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక బీజేపీ నేత సెల్పీ వీడియో తీసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఎనుమాముల బాలాజీనగర్కు చెందిన గంధం కుమారస్వామి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత నగరపాలక సంస్థ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్...
టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇవాళ ములుగు లోని సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజాలు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సిద్దమైంది. హాత్ సే హాత్ జోడో అభియాన్లో భాగంగా సోమవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడార...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రం సిద్దమైంది. 38 శాతంగా ఉన్న డీఏను నాలుగు శాతం నుంచి పెంచి 42 శాతం చేయాలని నిర్ణయం వల్ల కోటిమందికి పైగా ఉద్యోగులు, పెన్షన్దారులకు లబ్ధి చేకూరనుంది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా డీఏను సవరిస్తారు. గతేడాది డిసెంబరు నెలకు గాను సవరించిన సీపీఐ-ఐడబ్ల్యూను జనవరి 31న విడుదల చేశారు. ఇందులో డీఏను 4.23 శాతం పాయింట్లు పెంచాలని నిర్ణయ...
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేత, మాజీ లోకసభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం పైన పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నది. పొంగులేటితో భేటీ అయిన 20 మంది వైరా నాయకుల పైన వేటు వేసింది బీఅర్ఎస్ అధిష్టానం. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొరియ రాజశేఖర్, వైరా పురపాలక చైర్మన్ జైపాల్ సహా ఇరవై మందిని పార్టీ నుండి బహిష్కరించింది. పార్టీ అధిష్టానం పైన పొంగులేటి ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్ట...
నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ రేంజ్ కు వెళ్లడంపై స్పందించారు. మేము అమెరికాకు వెళ్లాం.. ఇటు జపాన్ కు వెళ్లాం.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు వెళ్లాం.. ఇటు ఆస్కార్ లో నాటు నాటు పాటకు నామినేషన్ దక్కింది. ఇదంతా మా గొప్పదనం కాదు. అభిమానించే అభిమానులు, ప్రేక్షక దేవుళ్లు మీ అంద...
NTR 30 : ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా గురించే సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇది ఎన్టీఆర్ కు 30 వ సినిమా. ఆర్ఆర్ఆర్ 29వ సినిమా. ఎన్టీఆర్ 30 వ సినిమాకు కొరటాల శివ డైరెక్టర్. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నారు కొరటాల శివ. వీళ్ల కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను వీళ్ల కాంబోలో ప్రకటించారు […]
యువతకు ఉద్యోగాలు రావాలంటే సైకో పోయే సైకిల్ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పైన ఆయన నిప్పులు చెరిగారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నారని ఎద్దేవా చేశారు. కష్టజీవులైన గాండ్ల కులస్తుల ...
పుల్లారెడ్డి స్వీట్స్(Pulla Reddy Sweets)సంస్థ కుంటుంబం మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్(jubilee hills)లో కోట్ల విలువైన ప్లాట్ ను పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కబ్జా చేశారని సమాచారం. నకిలీ ఆధార్ కార్డు, ఫేక్ పత్రాలతో ప్లాట్ కొనేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఆశ్రయించగా..రాఘవరెడ్డి, అతని కుటుంబ సభ్యులపై కేసు న...
జ్యూయెలరీ షాపులలో దొంగలు పడటం సహజమే కానీ.. ఆ దొంగలు మనుషులు కాకుండా వేరే అయితే అప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా ఓ గోల్డ్ షాపులో ఎలుక దొంగతనం చేసింది. అది కూడా ఏదో చిన్న దొంగతనం కాదండోయ్. పెద్దదే. వస్తువు చిన్నదే అయినా అది ఎత్తుకెళ్లింది చాలా కాస్ట్లీ ఐటెమ్. అదే డైమండ్ నెక్లస్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #अब ये चूहा डायमंड का नेकलेस किसके [&hel...
టీడీపీ నేత నారా లోకేశ్(nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా…సైకో పోయి సైకిల్ రావాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. నాడు నేడు అంటూ హడావిడి తప్ప అభివృద్ధి ఏం చేయడం లేదని ఆరోపించారు. గతంలో ప్రజలతో మాట్లాడిన సీఎం ...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాందేడ్లో ఇవాళ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఈసందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కిసాన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. బహిరంగ సభ అనంతరం నాందేడ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తుంద...
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ బాలయ్య విత్ పవన్ కల్యాణ్ ప్రొమో పార్ట్ 2 వచ్చేసింది. ఈ ప్రొమోలో పవన్ కల్యాణ్ ను బాలకృష్ణ క్రేజీ ప్రశ్నలు అడిగారు. అసలు జేబులో చేతులు ఎందుకు పెట్టుకుంటారని బాలయ్య అడిగి..మళ్లీ ఎవరిని కొట్టకుండా ఆపుకోవడానికే పెట్టుకుంటున్నారా అని NBK చమత్కరిస్తాడు. ఆ తర్వాత కారుపైన కూర్చుని వెళ్లడం గొడవ ఎంటి? టీడీపీతో పొత్త పెట్టుకుంటారా? అసలు మ...
గత నెలలోనే కదా వైజాగ్ టు హైదరాబాద్ వందే భారత్ ట్రెయిన్ను లాంచ్ చేసింది. ఈ ట్రెయిన్ లాంచ్ అయి నెల కూడా కాలేదు. అప్పుడు రైలుపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల ట్రెయిన్లో ప్రయాణికులు చెత్త, వాటర్ బాటిల్స్ పడేసి.. రైలు మొత్తాన్ని చెత్తతో నింపేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా. ఆ ఫోటోపై రైల్వే శాఖ వెంటనే స్పందించింది. రైలులో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సహాయక సిబ్బందిని […]