• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

శ్రీకాళహస్తిలో దారుణ హత్య

TPT: శ్రీకాళహస్తి రూరల్ మండలం చిన్నమిట్ట కండ్రిగ గ్రామపంచాయతీ ఒటిగుంట సెంటర్లో ఓ వ్యక్తి శనివారం హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. శ్రీకాళహస్తి మండలం K.వెంకటాపురం గ్రామానికి చెందిన గుండుగారి రవి(30)ని ఒటిగుంటకు చెందిన ఆర్ముగం(38) శనివారం కత్తితో నరికి హత్యచేశాడు. రూరల్ సీఐ రవి నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

December 1, 2024 / 04:03 AM IST

యువకుడి దారుణ హత్య

AP: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడులో వెంకటేశ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడి కళ్లలో కారం కొట్టి కర్రలు, రాడ్లతో దుండగులు దాడి చేసి చంపారు. పాత కక్షల కారణంగానే యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

October 31, 2024 / 11:28 PM IST

కత్తులతో ఇరువర్గాలు దాడి.. ముగ్గురు మృతి

AP: కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాజులూరు మండలం సలపాకలో రెండు వర్గాలు కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతిచెందారు. పాత కక్షలతో ఇరువర్గాలు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 31, 2024 / 11:03 PM IST

రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు.. ఐదుగురు అరెస్ట్

ముంబాయిలోని ఓ వ్యాపారవేత్తను రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో బాధితుడు రూ.55 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహరంపై స్పందించిన పోలీసులు బాంద్రాలో ఉన్న ఛోటారాజన్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

October 31, 2024 / 09:09 PM IST

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

AP: కృష్ణాజిల్లా కొండాయపాలెంలో  విషాదం చోటుచేసుకుంది. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. విషయం గమనించిన స్థానికులు కారులో ఉన్న మిగతావారిని రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి ఆరా తీస్తున్నారు.

October 31, 2024 / 08:47 PM IST

మండవల్లి మండలంలో ఏడుగురు అరెస్టు

కృష్ణా: మండవల్లి మండలంలోని అయ్య వారిరుద్రవరం గ్రామ శివారులో జూదం ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను, భైరవపట్నంలో కోడి పందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు SI రామచంద్రరావు తెలిపారు. అయ్యవారి రుద్రవరంలో రూ.6,420 నగదు, కోడీపందెం వేస్తున్న వారి వద్ద నుంచి రూ.5,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

October 31, 2024 / 08:44 PM IST

దారుణం.. బాలికపై నలుగురు అత్యాచారం

TG: రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు బాలురు బాలికపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని దోమ పీఎస్ పరిధిలో జరిగింది. కాగా, బాలిక కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలికపై అఘాయిత్యం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 31, 2024 / 08:39 PM IST

బాణసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

జార్ఖండ్‌లోని బొకారోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టపాసుల దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. 50కి పైగా బాణసంచా షాప్‌లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

October 31, 2024 / 08:36 PM IST

గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

TG: గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్‌లోని ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. ఉప్పల్ శాంతినగర్ మై ఫీల్ రెస్టారెంట్ ప్రాంతంలో ఒరిస్సాకు చెందిన సుమన్ పాల్, అశోక్ బిస్వాస్, బిపుల్ బిస్వాస్ గంజాయి అమ్మకాలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎస్టీఎఫ్ టీమ్ దాడి చేయగా 3.8 కేజీల ఎండు గంజాయి పట్టుబడింది. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, జైలో కారును స...

October 31, 2024 / 08:14 PM IST

మద్యం మత్తులో కాలువలో పడి వ్యక్తి మృతి

VZM: మెరకముడిదాం మండలం బుధరాయవలసకు చెందిన కాంక్రీట్ లేబర్‌గా పనిచేస్తున్న ఎలకల జోగి నాయుడు (40) గురువారం మధురవాడ మొగదారమ్మ కాలనీ సమీపంలోని ఉన్న కాలువలో పడి మృత చెందాడు. పండగ పూట మద్యం మత్తులో కాలువలో పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

October 31, 2024 / 07:34 PM IST

బాణసంచా పేలి ఒకరు మృతి

ELR: ఏలూరులోని తూర్పు వీధి గౌరీ దేవి గుడి వద్ద ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఉల్లిపాయ బాంబులు తీసుకెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోతుల పడగా బాంబులు పేలి బండిపై వెనకాల కూర్చున్న సుధాకర్ అనే వ్యక్తి అక్కడక్కడ మృతి చెందాడు. చుట్టుపక్కల ఉన్న మరో ఐదుగురు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు. పోలీసులు విచారణ చేపట్టారు.

October 31, 2024 / 06:18 PM IST

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు

ELR: ఉంగుటూరు జాతీయ రహదారి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నారాయణపురం నుండి ఉంగుటూరు వెళుతుండగా వెనక నుంచి ఒక వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలు కాగా, అతనిని హైవే అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది.

October 31, 2024 / 05:46 PM IST

యువకుడు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

ATP: అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ప్రభాకర్ కుమారుడు డీ. భరత్ తేజ అదృశ్యమయ్యాడు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి, తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు అనంతపురం 2 టౌన్ సీఐ 9440796806, ఎస్ఐ 9346917119 నంబర్లకు తెలపాలని కోరారు.

October 31, 2024 / 05:32 PM IST

పామర్రు హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

కృష్ణా: పామర్రులో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామర్రు నుంచి కత్తిపూడి నేషనల్ హైవే కొత్త పెదమద్దాలి గ్రామం వద్ద కారు అదుపు తప్పింది. రోడ్డుపక్కనే ఉన్న కాలువలోకి కారు దూసుకుపోయినట్లు స్థానికులు వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయినట్లు తెలిపారు.

October 31, 2024 / 05:20 PM IST

సముద్రంలో విద్యార్థి గల్లంతు

VZM: భోగాపురం మండలం కొండ రాజుపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల దానయ్య సముద్రంలో గల్లంతయ్యాడు. గురువారం ఉదయం ముగ్గురు స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లాడు. దానయ్య గల్లంతుకావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దానయ్య రామచంద్రపేట హైస్కూల్‌లో పదోతరగతి చదువుతున్నాడు.

October 31, 2024 / 05:17 PM IST