ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి వదిలిన వరద నీరు నాగాయలంక రేవుకు చేరింది. శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాట్లో కృష్ణమ్మ విగ్రహాన్ని తాకేంత వరద ఉద్ధృతి కనిపించింది. మత్స్యకారులు పడవలు ఒడ్డుకు చేర్చి లంగర్లు వేశారు. వరద దృశ్యాలు చూడటానికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు.