PLD: CM చంద్రబాబు ఈ నెల 19 నుంచి దావోస్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, ఈ నెల 18న అమరావతిలో జరగాల్సిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. సీఎం విదేశీ పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండల అధికారులు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.