ప్రకాశం: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 20, 21 తేదీలలో రాష్ట్రస్థాయిలో మహిళల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు కడియం శేషగిరిరావు తెలిపారు. సెయింట్ జాకబ్స్ ఉన్నత పాఠశాలలో జరగనున్న ఈ పోటీల్లో విజేతలకు రూ. 40వేలు, రూ. 30వేలు, రూ.20వేలు, రూ.10వేలు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ.500 ఎంట్రీ ఫీజు చెల్లించాలన్నారు.