సత్యసాయి: జిల్లాలో ప్రమాదాల నివారణకు పోలీసులు ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున రహదారులపై పోలీసులు వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగించి పంపించారు. చిలమత్తూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై వాహనాలు నిలిపిన పోలీసులు డ్రైవర్లకు పలు సూచనలు చేసి, ఫేస్ వాష్ చేయించి పంపారు.