SKLM: సంక్రాంతి పండుగ సందర్భంగా పలాస కు చెందిన సూక్ష్మ కళాకారుడు బ్రహ్మర్షి కొత్తపల్లి రమేష్ ఆచారి బియ్యం గింజంత సైజులో బంగారు గాలిపటం నమూనాతో పాటు ‘సంక్రాంతి’ అనే స్వర్ణ లోగో ను తయారు చేశారు. సుమారు పది మిల్లీ గ్రాముల బంగారంతో, అర సెంటీమీటర్ల ఎత్తు, వెడల్పుతో, పలుచటి బంగారు రేకుపై ఈ కళాఖండాన్ని మూడు గంటల సమయంలో రూపొందించినట్లు తెలిపారు.