ప్రకాశం: బల్లికురవ మండలంలోని వల్లాపల్లిలో నీటి కుంటలో పడి పశువుల కాపరి మందా పిచ్చయ్య (30) మృతి చెందాడు. ఎస్సీ కాలనీకి చెందిన పిచ్చయ్య పశువులను పొలానికి తోలుకుని వెళ్లాడు. అవి నీటి కుంటలో దిగగా వాటిని బయటకు తోలేందుకు పిచ్చయ్య కూడా దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు.