ELR: కొల్లేరు వరదలు వల్ల వేలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువులు ముంపునకు గురై నష్టపోయిన ఆక్వా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం భీమడోలు సీఐటీయు కార్యాలయంలో జరిగిన సమావేశానికి కట్టా భాస్కరరావు అధ్యక్షత వహించారు.