CTR:కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బుధవారం ఆలయ పునర్నిర్మాణ,బంగారు వాకిలి, వెండి వాకిలి దాత గుత్తికొండ శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. ఈ.వో పెంచల కిషోర్ వారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.