VZM: మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ సూచించారు. డెంకాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నేడు అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నాయన్నారు.