కృష్ణా: చల్లపల్లిలో సోమవారం యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచీ ప్రధాన సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ర్యాలీ చేశారు. చల్లపల్లి వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, ఎంపీడీఓ ఏ.వి.రమణ, ఎంపీటీసీ పైడిపాముల స్వప్న, ఈఓ పీవీ మాధవేంద్రరావు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.