ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే పురోహితులు రామకృష్ణ స్వామివారికి పంచామృతం, ఏకబిల రుద్రాభిషేకం చేపట్టి స్వామి మూల విరాట్ను మామిడి పండ్లతో అలంకరించారు. మంగళ నైవేద్యాలు అందించారు. అనంతరం భక్తులు దర్శించుకుని తన్మయత్వం పొందారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.