కృష్ణా: తీర గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో త్రాగునీరు అందించారు. సోమవారం నాగాయలంక మండలం హంసలదీవి గ్రామస్తులకు ఇరవై వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటరు ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేశారు. ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో మండలి ఫౌండేషన్ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ యువ నాయకులు, మండలి వెంకట్రామ్ పర్యవేక్షించారు.