MLG: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కేటాయించారనే ఆరోపణలపై మంత్రి సీతక్క సోమవారం దృష్టి సారించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుని లబ్ధిదారుల జాబితా ఖరారు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మహిళలు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ పరువుకు భంగం కలగకుండా సీతక్క ఆ నాయకులపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.