KMM: పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. సోమవారం సత్తుపల్లి పట్టణంలోని 6వ వార్డులో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అధిక మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని పేర్కొన్నారు.