ATP: పుట్లూరు మండలంలోని పలు గ్రామాల్లో చెక్ డ్యాములు నిర్మించాలని పుట్లూరు బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. చెక్ డ్యాములు నిర్మించడం వల్ల నీటి సామర్థ్యం పెరుగుతుందన్నారు. రైతులకు ఎండాకాలంలో తాగునీటి సమస్య రాకుండా ఉంటుందన్నారు. వాగులు, కాలువలలో ఉన్న లోతట్టు ప్రాంతాలకు డ్యాములు నిర్మించాలని కోరారు.