KMR: గురుకుల పాఠశాలలో చేరేందుకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు బిక్కనూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రఘు తెలిపారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్లు పొందేందుకు ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 9 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ST, SC, BC మైనార్టీ గురుకులాలలో చదివే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.