KRNL: ప్రాథమిక పాఠశాలల్లో పునాదులు బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని కర్నూలు డీఈవో శ్యామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు మండలం బి. తాండ్రపాడులో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడాతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులు, టెక్నాలజీని ఉపయోగించాలని తెలిపారు. విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణంలో అభ్యాసం జరిగేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.