CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి శనివారం వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వాములు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వరుసగా రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ పెరిగి క్యూ లైన్లు నిండిపోయినట్లు అధికారులు తెలిపారు.