2001లో పార్లమెంటు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల క్రితం జరిగిన ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. ఈ ఘటన జరిగి 23 ఏళ్లు పూర్తయిన వేళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా తదితరులు నివాళులర్పించారు.