KTR: తెలంగాణ మాజీ సీఎం ముఖ్యమంత్రి నేతృత్వంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులకు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఊహించని నిరసన ఎదురయింది. మాజీ మంత్రులు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి చేశారు. కృష్ణ జలాల హక్కుల పేరిట నిర్వహిస్తున్న చలో నల్గొండ భారీ బహిరంగసభకు అగ్రనేతలతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తున్న బస్సును ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్లచొక్కాలను ధరించి బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలతో నిరసన చేపట్టారు. బస్సుపై కోడిగుడ్లను విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గోబ్యాక్ అంటూ వారు నినదించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీటి కాలనీలో వీరిని అడ్డుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
చదవండి:CM Revanth: కేసీఆర్ కోసం హెలికాఫ్టర్ రెడీగా ఉంది.