KNR: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలైన ఘటన చొప్పదండి మండలం గుమ్లాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన పెరుమాండ్ల శ్రీనివాస్ గీత కార్మిక వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం కల్లు తీసేందుకు తాటిచెట్టు పైకి ఎక్కిన శ్రీనివాస్ అకస్మాత్తుగా పైనుంచి జారి కింద పడడంతో స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KNR: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ షెడ్యూల్ వెలువడినందున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మార్చి 8వ తేదీ వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. కలెక్టర్ ఎన్నికల నియామవళిపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రజలను ప్రభావితం చేసేలా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడలపై రాతలు, చిత్రపటాలు తొలగించాలని హెచ్చరించారు.
NLG: వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున, నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని అధికారులు, నాయకులకు సూచించారు.
NLG: త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన ధనావత్ వస్రాం నాయక్ భారత ద్వివాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలు నుంచి ప్రశంసలు అందుతున్న విషయం అందరికి తెలిసిందే. దానికి దానికి గర్వకారణమైన విషయాన్ని పురస్కరించుకొని మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ స్వగృహంలో మిత్రులతో కలిసి పూలదండలు వేసి శాలువాతో సత్కరించి సన్మానించారు.
NRPT: నర్వ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే వాకిటిశ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కందులకు ప్రభుత్వం మద్దతు ధర రూ.7,550 చెల్లించి కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.
HYD: బాలానగర్ పీఎస్ పరిధి గాంధీనగర్ చెత్తకుండీలో గురువారం పేలుడు సంభవించింది. దీంతో చెత్త క్లీన్ చేస్తున్న మహిళకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై క్లూస్ సేకరిస్తున్నారు.
HYD: పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగని మల్కాజిగిరి ఎంపీ ఈటల సత్కరించారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నంపెట్టే ప్రజలకు అండగా మంద కృష్ణ నిల్చడని ఎంపీ ఈటల కొనియాడారు. జాతిని పైకి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉండటం గొప్ప విషయమన్నారు. నమ్ముకున్న జాతిని, నమ్ముకున్న ఆశయాన్ని, గమ్యాన్ని ముద్దాడే వరకు వెనకడుగు వేయని వ్యక్తి అంటూ ఈటల పేర్కొన్నారు.
MDK: కౌడిపల్లి మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ కొల్చారం మండలంలో AEOగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. 5వ సారి జాతీయ స్థాయికి ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
HYD: నేడు జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. దీంతో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంకాగానే ముందుగా గాంధీవర్ధంతి కావడంతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తర్వాత బడ్జెట్ పై చర్చలు ప్రారంభించనున్నారు. సభ్యుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుని మార్పులు, చేర్పులు చేయనున్నారు.
WGL: కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో వరంగల్ కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ నవీన్ రెజ్లింగ్లో 97కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో హైదరాబాద్ కమిషనరేట్కు చెందిన క్రీడాకారుడిపై విజయం సాధించి తొలి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతోపాటు జట్టు మేనేజర్ నాగయ్య నవీన్కు అభినందనలు తెలిపారు.
MDK: నార్సింగి మండలం శేరిపల్లి జడ్పీ పాఠశాల భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు తిరుపతి ఢిల్లీ సీసీఆర్టీ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఢిల్లీలో సీసీఆర్టీ శిక్షణ పూర్తి చేసుకున్న తిరుపతికి డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ చేతుల మీదుగా సర్టిఫికెట్ పొందారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ విద్యా భోధన తీరు, దేశంలో వివిధ ప్రాంతాల్లో థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్పై ఆవగహన కల్పించినట్లు తెలిపారు.
HYD: లక్ష డప్పుల వెయ్యి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సహకారం అందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ను ఆయన నివాసంలో మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిసి లక్ష డబ్బులు వెయ్యి గొంతుకుల కార్యక్రమానికి ఆహ్వానించారు.
WGL: జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో గురువారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా పిల్లలకు గుండె పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు చిన్నారులకు ఉచితంగా 2డి ఎకో పరీక్షలు నిర్వహిస్తారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎంహెచ్ఓ సాంబశివరావు కోరారు.
KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం పోలీస్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడో తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడాకారులు వారి వారి క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. క్రీడా పోటీలను పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ప్రారంభించారు.
WGL: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నేడు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. నర్సంపేట నియోజకవర్గంకి సంబంధించిన పలు విషయాలపై మంత్రి పొన్నం దృష్టికి తీసుకువెళ్లినట్లు MLA తెలిపారు. నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు.