NRPT: నారాయణపేట పట్టణంలోని సుభాష్ రోడ్ నుంచి కొండారెడ్డిపల్లి చెరువు వరకు గల ప్రమాదకర ప్రాంతాలను డీఎస్పీ లింగయ్య సోమవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.