NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్లో పర్యావరణాన్ని కాపాడాల్సిన అటవీ అధికారులే భక్షకులుగా మారుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల అండతో వ్యాపారులు భారీ వృక్షాలను యథేచ్ఛగా నరికివేస్తున్నట్లు గ్రామస్థులు మండిపడుతున్నారు. గత కొద్దిరోజులుగా చెట్ల నరికివేత కొనసాగుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడంపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.