NZB: టీయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ‘వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్’ ఫీజు చెల్లింపుకు నేటితో గడువు ముగియనుందని టీయూ పరీక్షల నియంత్రణాధికారి సంపత్ కుమార్ సోమవారం తెలిపారు. 2016-2020 మధ్య చేరిన B.A, B.Com, B.Sc, B.B.A విద్యార్థులు తమ పెండింగ్ సెమిస్టర్ల (1 నుంచి 6 వరకు) పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుంతో ఈ నెల 27 వరకు అవకాశం ఉందన్నారు.