TG: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సంగంపల్లికి చెందిన కూన సంపత్ అనే మత్స్యకారుడి వలకు అరుదైన బొచ్చె చేప చిక్కింది. దిగువ మానేరు జలాశయంలో చేపలు పడుతుండగా సంపత్ వలలో 25 కిలోల బొచ్చె చేప చిక్కింది. ఏళ్ల నుంచి చేపలు పడుతున్నా.. ఇంత పెద్ద చేప ఎప్పుడూ చిక్కలేదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మార్కెట్లో ఈ భారీ చేపను విక్రయించగా రూ.3750 వచ్చినట్లు చెప్పారు.