• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు, 2 పెద్ద గొర్రెల మృతి

NDL: మహానంది మండలం గాజులపల్లిలో కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు, 2 పెద్ద గొర్రెలు గురువారం మృతిచెందాయి. గ్రామానికి చెందిన సాకలి రామకృష్ణ గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. గొర్రె పిల్లల వద్ద ఎవరూ లేని సమయంలో వీధి కుక్కలు దాడి చేసి చంపాయని బాధితుడు వాపోయాడు. సుమారు రూ.లక్ష పైగా నష్టం వాటిల్లిందని తెలిపాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.

December 12, 2024 / 05:54 PM IST

రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన డీసీఎం

WGL: రోడ్డు దాటుతున్న మహిళను డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన వర్ధన్నపేట పట్టణంలో జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. కొండేటీలక్ష్మి ఓ వేడుకకు హాజరై రోడ్డు దాటుతున్న క్రమంలో వరంగల్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో తీవ్రగాయాల పాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు.

December 12, 2024 / 05:35 PM IST

కొండాపురంలో రైలు కిందపడి వ్యక్తి మృతి

KDP: గుంతకల్ రైల్వే జంక్షన్ పరిధిలో కొండాపురం మండలంలోని రేగడపల్లి స్టేషన్ సమీపంలో గురువారం సాయంకాలం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఇతను రైలులో నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 12, 2024 / 05:16 PM IST

ప్రమాదవశాత్తు నదిలో మునిగి పంజాబ్ వాసి మృతి

KRNL: నదిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రం జలంధర్క చెందిన దుగ్గాల నరేశ్ (42) బుధవారం సాయంత్రం పంచలింగాల సమీపంలోని తుంగభద్ర నది తీరాన ఉన్న గంగమ్మ గుడి వద్ద స్నానం చేసేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు పడిపోయి, ఈత రాకపోవడంతో మునిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కర్నూలు తాలూకా ఎస్ఐ నరేశ్ తెలిపారు.

December 12, 2024 / 04:52 PM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

ATP: ధర్మవరం కళాజ్యోతి సర్కిల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమణి అనే మహిళ గాయపడి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం దొడ్డబల్లాపూర్‌కు చెందిన నాగమణి తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ధర్మవరం కళాజ్యోతి సర్కిల్ వద్ద వెనక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

December 12, 2024 / 04:34 PM IST

పంచాయతీ పైపులైన్ తగలబెట్టిన మాజీ సర్పంచ్

ELR: ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామంలో పంచాయతీ పైపులైన్‌ను మాజీ సర్పంచ్ సత్యనారాయణ, అతని భార్య సరస్వతిలు పెట్రోల్ పోసి తగులు పెట్టారని సర్పంచ్ రాజగోపాలరావు (గోపి) ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మాట్లాడుతూ.. గ్రామ ప్రజల దాహం తీర్చేందుకు పైపులైన్ వేస్తుంటే తగులు పెట్టడం దారుణమన్నారు. పక్కనే అంగన్వాడీ చిన్నారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

December 12, 2024 / 01:54 PM IST

కువైట్ నుంచి వచ్చి చంపేశాడు..!

ఉమ్మడి కడప జిల్లా ఓబులవారిపల్లె(M) కొత్తమంగంపేటలో ఆంజనేయులు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. అతడిని చంపిన వ్యక్తి సంచలన విషయాలు వెల్లడించాడు. ‘కువైట్ వెళ్తూ నా కుమార్తెను నా చెల్లెలి ఇంట్లో విడిచిపెట్టా. ఇటీవల మా చెల్లె మామ ఆంజనేయులు నా బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే కువైట్ నుంచి వచ్చి నేనే చంపాను వాంగ్మూలం ఇచ్చాడు.

December 12, 2024 / 12:46 PM IST

యువతితో సహజీవనం.. ఆపై మోసం!

HYD: యువతితో సహజీవనం చేసి ఆమె నుంచి రూ. లక్షల్లో తీసుకొని ఉడాయించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధురా నగర్ PS పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వైజాగ్‌కు చెందిన యువతి HYDలో బ్యూటీషియన్‌గా పని చేస్తూ స్థిరపడింది. ఆమెకు ఓ క్యాబ్ డ్రైవర్ పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో సహజీవనం చేశాడు. పెళ్లి ప్రస్తావన రాగానే ఇద్దరి మతాలు వేరు అంటూ ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి పోలీసులు ఫిర్యాదు చేసింది.

December 12, 2024 / 12:42 PM IST

కడియం జాతీయ రహదారిపై లారీ బోల్తా

E.G: కడియం మండలంలోని పొట్టిలంక గ్రామం వద్ద ఉన్న జాతీయ రహదారి పై గురువారం లారీ బోల్తా కొట్టింది. వాటర్ బాటిల్స్‌తో వెళ్తున్న లారీ.. డ్రైవర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురవ్వడంతో లారీ అదుపు తప్పి నర్సరీలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

December 12, 2024 / 12:25 PM IST

ప్రియుడి వేధింపులతో బాలిక ఆత్మహత్య

AP: ప్రియుడి వేధింపులు తాళలేక మైనర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం పాచిగుంట గ్రామంలో చోటు చేసుకుంది. 6 నెలల క్రితం మామ కుమారుడితో 17ఏళ్ల బాలికకు కుటుంబ సభ్యలు వివాహం చేశారు. మైనర్ కావడంతో ఇంట్లోనే ఉంచుకుంటున్నారు.అదే గ్రామానికి చెందిన వసంత కుమార్‌తో బాలికకు పరిచయం ఉంది. బాలిక వద్ద నుంచి వసంత కుమార్ రెండు సవర్ల బంగారం తీసుకొని వేధింపులకు గురి చేస్తుండటంతో బావిలో దూకి ఆత...

December 12, 2024 / 11:37 AM IST

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా ఇవాళ అబుజ్హామాద్‌లోని ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కాల్పులు మొదలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 12, 2024 / 11:30 AM IST

కారు బోల్తా ఒకరికి గాయాలు

MBNR: కారు అదుపుతప్పి బోల్తా పడి ఒకరికి గాయాలైన ఘటన బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామ శివారులో గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గౌతం పల్లికి చెందిన హతిరాం నాయక్ షాద్‌నగర్ నుంచి గౌతంపల్లి వెళ్తుండగా..పెద్దరేవల్లి గ్రామ శివారు మోదంపల్లి గేటు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు చెప్పారు.

December 12, 2024 / 11:28 AM IST

గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

GNTR: నగర కేవీపీ కాలనీ రోడ్డు భవానిపురం కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి(35) దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతుడి తలపై రాళ్లతో కొట్టినట్టుగా గుర్తించారు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో 2 రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది అని తెలిపారు.

December 12, 2024 / 11:18 AM IST

హైవేపై కూలిన విమానం

అమెరికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని విక్టోరియా హైవేపై విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, పలు కార్లు ధ్వంసమైనట్లు తెలిపారు. విమానంలో ఉన్నవారంతా సేఫ్‌గా ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

December 12, 2024 / 10:01 AM IST

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

MBNR: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలిలా.. జడ్చర్ల మండలం లింగంపేట మాజీ సర్పంచ్ కృష్ణయ్య గౌడ్ (45) మృతిచెందగా.. ఆగి ఉన్న లారీ ఢీకొని రాంప్రకాశ్, లవకుశ్ మృతి చెందారు. కర్నూల్ జిల్లాకి చెందిన గొడ్డయ్య గౌడ్ పాల పాకెట్ల కోసం వెళ్లి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనండంతో బుధవారం చనిపోయాడు.

December 12, 2024 / 09:57 AM IST