తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఒకే అంశంపై, విజయవాడ వరదపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విఉద్దేశించి వారి అభిప్రాయాన్ని తెలియజేసారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ విజయవాడలోని వరద పరిస్థితిపై స్పందించారు
తెలంగాణా ఖమ్మం జిల్లాలో పెద్ద మొత్తంలో వరద ప్రవాహం పెరిగింది. ఈ సందర్భంలో, కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, “పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరద రక్షణ చర్యల కోసం 6 రక్షణ హెలికాప్టర్లు, 150 రక్షణ బోట్లను ఉపయోగిస్తున్నది. కానీ, తెలంగాణా ప్రభుత్వం ఎన్ని ఉపయోగిస్తోంది? ఒక పెద్ద జీరో,” అని పేర్కొన్నారు. కేటీఆర్ ఈ వ్యాఖ్యలతో, తెలంగాణ ప్రభుత్వానికి వరద పరిస్థితుల్లో ఏమీ చేయడం లేదని, ఆంధ్రప్రదేశ్కు మాత్రం తీవ్ర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపడుతుందని అన్నారు.
Read Also: నా వరుకు మహేష్ బాబే గ్రేట్: విజయ్ ప్రొడ్యూసర్
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఈ ఉదయం విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను సక్రమంగా నిర్వహించట్లేదు,” అని విమర్శించారు. ప్రజలను పట్టించుకోకుండా వదిలేశారని, ప్రజలు ఏమి చెయ్యాలో అర్థంకాని స్థితిలో బంధువుల ఇంటికి పోతున్నారని మండిపడ్డారు. జగన్ ఆయన వ్యాఖ్యలతో, ప్రభుత్వం సహాయ చర్యలలో కొరత ఉందని, ప్రజలకు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Read Also: Vijay GOAT: తెలుగు రాష్టాల్లో 4AMకి బెనిఫిట్ షోలు
ఇవి రెండూ విభిన్న వ్యాఖ్యలుగా మారాయి. కేటీఆర్ తన రాష్ట్రానికి అవసరమైన సహాయం ఇవ్వడంలో విఫలమైన తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు, అదే సమయంలో వై.ఎస్. జగన్ తమ రాష్ట్రంలో నెగటివ్ వాతావరణాన్ని పరిశీలించి, ప్రభుత్వ చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

