• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేవంద్రపాడు వంతెనను పునర్నించండి

GNTR: రేవంద్రపాడు వద్ద బకింగ్ హోమ్ కెనాల్‌పై శిథిలావస్థలో ఉన్న పురాతన వంతెనను పునర్నించాలని నూతక్కి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం మంత్రి లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రేవంద్రపాడు వంతెనపై నిత్యం వేలాదిమంది ప్రజలు, రైతులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, శిథిలావస్థలో ఉన్న వంతెనపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

September 21, 2024 / 03:57 PM IST

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంఈఓ

VZM: వేపాడ మండలం కొంపల్లి ఎంపీపీ పాఠశాలను ఎంఈఓ పి బాల భాస్కరరావు శనివారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో చతుర్విధ ప్రక్రియలు చేయించి వారి అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ పాటించాలని కోరారు.

September 21, 2024 / 03:57 PM IST

అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు

TPT: గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు-2 అంగన్వాడి కేంద్రాల్లో శనివారం పౌష్టికాహారం మాస ఉత్సవాలు నిర్వహించారు. విందూరు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ పౌష్టికాహార మాసోత్సవాలను సూపర్వైజర్ హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం గురించి ఆమె వివరించారు.

September 21, 2024 / 03:57 PM IST

బ్రిడ్జి పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నం

W.G: చాగల్లు గ్రామానికి చెందిన ఒక యువకుడు రాజమండ్రి గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యకి చాగల్లుకి చెందిన రఘుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.

September 21, 2024 / 03:55 PM IST

‘మాజీ సీఎంను అరెస్టు చేయాలి’

KKD: జగ్గంపేట పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ.. తిరుమల లడ్డు అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

September 21, 2024 / 03:54 PM IST

జిల్లాస్థాయి పోటీలకు 11 మంది ఎంపిక

SKLM: జిల్లాస్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలకు పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఎంపికైనట్లు శనివారం వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయ్ కుమార్, రమణ, రజినీలు తెలిపారు. తొగరాంలో జరిగిన నియోజకవర్గస్థాయి వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంకయ్యారని అన్నారు. విద్యార్థులను హెచ్ఎం పి.వెంకట్రావు, పాఠశాల సిబ్బంది అభినందించారు.

September 21, 2024 / 03:53 PM IST

అధైర్య పడొద్దు.. అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే శిల్పా

NDL: ఆత్మకూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మండల, పట్టణంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ పరంగా పలు అంశాలపై చర్చించారు. ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే శిల్పా తెలియజేశారు.

September 21, 2024 / 03:51 PM IST

ఈనెల 24న అమలాపురంలో జాబ్ మేళా

కోనసీమ: నిరుద్యోగ యువత కోసం ఈ నెల 24వ తేదీన వికాస సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం తెలిపారు. అమలాపురం కలెక్టరేట్‌లోని సంస్థ జిల్లా కార్యాలయంలో మేళా ఉంటుందన్నారు. కాకినాడకు చెందిన రిప్యూటెడ్ ఫార్మా కంపెనీలో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. SSC, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

September 21, 2024 / 03:48 PM IST

పేదల సంరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే గోరంట్ల

E.G: పేదల సంరక్షణ ధ్యేయంగా వారి ఆరోగ్యమే మహాభాగ్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నలుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని నిధులు మంజూరు చేశారన్నారు.

September 21, 2024 / 03:43 PM IST

సీఎం చంద్రబాబు నాయుడు వినతుల స్వీకరణ

GNTR: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు, వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుండి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సాయం అందించారు. భూముల రీ సర్వేలో భూమి కోల్పోయిన వారు సీఎంకు ఫిర్యాదు చేశారు.

September 21, 2024 / 03:42 PM IST

‘ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదుకోవాలి’

ELR: కొల్లేరు వరదలు వల్ల వేలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువులు ముంపునకు గురై నష్టపోయిన ఆక్వా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం భీమడోలు సీఐటీయు కార్యాలయంలో జరిగిన సమావేశానికి కట్టా భాస్కరరావు అధ్యక్షత వహించారు.

September 21, 2024 / 03:38 PM IST

VIDEO: కూటమి పాలనపై వైసీపీనేత ఘాటు వ్యాఖ్యలు

SKLM: ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు యువ నేత వెంకట చిరంజీవి నాగ్ శనివారం ఆయన ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. తల్లికి వందనం పథకానికి చంద్రబాబు మంగళం పాడారని, అలాగే నాన్నకు ఇంధనం పేరుతో నారావారి సారా స్రవంతిలో కొత్తగా మద్యం పాలసీ తెచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

September 21, 2024 / 03:38 PM IST

‘లడ్డు కలుషితంపై సీబీఐ విచారణ జరిపించాలి’

GNTR: తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలపటంపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు కోరారు. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డు కలుషితంపై హిందూ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు. వైసీపీ నేతలు చేసిన లడ్డు అక్రమ తయారీపై ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

September 21, 2024 / 03:38 PM IST

డౌనూరు ఆశ్రమ పాఠశాలలో శ్రమదానంతో పరిశుభ్రత కార్యక్రమం

విశాఖ: కొయ్యూరు మండలంలోని డౌనూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో శనివారం శ్రమదానంతో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించామని ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల, భోజన శాల ప్రాంతాలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను, పొదలను తొలగించారు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

September 21, 2024 / 03:37 PM IST

పీవో ఆధ్వర్యంలో జీసీసీ టెండర్ల నిర్వహణ

SKLM: సీతంపేట ఐటీడీఎ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాలకు ఆహార పదార్ధాలు సరఫరాకి ఐటీడీఎ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జీసీసీ టెండర్లను నిర్వహించింది. ఈ సందర్భంగా 31 వస్తువులు సరఫరాకి టెండర్లు నిర్వహించారు. 11 మంది టెండర్ దారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ అన్నదొర, జీసీసీ డీఎం సంధ్యారాణి, పాల్గొన్నారు.

September 21, 2024 / 03:36 PM IST